మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో బన్నీ మరదలుగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా నటిస్తోంది.
అలాగే ఇతర భాషల్లోనూ నటిస్తోంది. అయితే ఈ భామకు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోందట. ఇందులో భాగంగానే.. కొంతకాలం వరకు హీరోయిన్గా సినిమాలు చేసి ఆ తర్వాత ఒక కథను సిద్ధం చేసుకుని డైరెక్షన్ చేయాలని నివేదా ప్లాన్ చేసుకుంది ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్స్కు ధీటుగా సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అవుతున్న లేడీ డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. మరి ఈ లిస్ట్ నివేదా చేరుతుందో..లేదో.. చూడాల్సి ఉంది.