రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు..?

ఎనర్జిటిక్ యాక్షన్ తో మాస్ ప్రేక్షకుల మతిపోగెట్టేందుకు మాస్ మహారాజ్ రవితేజ ఈసారి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా..సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రవి తేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. రజిష విజయన్, దివ్యాన్ష కౌశిక్ లు మాస్ హీరో రవితేజ సరసన జత కట్టి స్టెప్పులేయనున్నారని తెలిసింది.

ఈ విషయాన్ని నేడు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటికే ‘రామారావు ఆన్ డ్యూటీ’ కి సంబందించిన పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మా సినిమా పోస్టర్లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. వీలైనంత తొందరగా ఈ సినిమాను చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. ఇండస్ట్రీలో మాస్ బ్రాండ్ ని సొంతం చేసుకున్న హీరో రవితేజ ఈసారి ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి. .