నితిన్‌తో తొలిసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న `ఫిదా` బ్యూటీ?

ఇటీవ‌ల చెక్, రంగ్‌దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా నేప‌థ్యంలో ఈ సినిమా రానుంద‌ని.. ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నార‌ని కూడా టాక్ న‌డుస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. అదేంటంటే..ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా ఫిదా బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ట‌. ఇటీవ‌లె మేక‌ర్స్ ఆమెను సంప్ర‌దించి క‌థ చెప్ప‌గా.. అది న‌చ్చ‌డంతో ఆమె కూడా నితిన్ స‌ర‌స‌న చేసేందుకు ఓకే చెప్పింద‌ట‌. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేసి.. క‌రోనా ఉధృతి త‌గ్గినంనంత‌రం షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.