ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మాటే వినిపిస్తోంది. తగ్గిందనుకున్న కరోనా మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. ఇక ఈ కరోనా కష్టకాలంలో పలువురు ప్రముఖులు తమ వంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా తనకూ మంచి మనసుందని నిరూపించుకుంది.
కరోనా లాక్డౌన్తో ముంబైలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను ఆమె పంపిణీ చేశారు. ఆహార పదార్థాలను స్వయంగా పూజా ప్యాక్ చేసి పేదలకు అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా, పూజా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.