ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బుల్లితెర ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇప్పటికే ఇక్కడ నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఐదో సీజన్ జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రాబోతోంది.
ఈ సీజన్కు హోస్ట్గా ఎన్టీఆర్ వ్యవహరించనున్నాడు. ప్రోమోలు కూడా విడుదల చేశారు. అయితే కొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం అవుతుంది అనగా.. కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. మరోవైపు కరోనా వల్ల ఎన్టీఆర్ షెడ్యూల్స్ అన్నీ కూడా మారిపోయాయి. దీంతో ఈ షో ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా అనేక రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తాజాగా ఈ రూమర్లకు షో నిర్వాహకులు ఒక్క వీడియోతో చెక్ పెట్టారు. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ఈ వీడియో ద్వారా తెలిపారు. అలాగే ఈ షో ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. చూస్తున్న వారికి వందశాతం వినోదం అందిస్తుందని కూడా వీడియోలో పేర్కొన్నారు. ఇక ఈ షో త్వరలోనే స్టార్ట్ అవుతుందని తెలియడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
https://twitter.com/GeminiTV/status/1401154336822992900?s=20