భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా అద్వానీ.. వినయ విధేయ రామ తర్వాత టాలీవుడ్ వైపే చూడలేదు. కానీ, బాలీవుడ్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్గా మారిపోయింది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా డీల్ అనేగా మీ సందేహం! శంకర్తో కియారా ముచ్చటగా మూడు సినిమాలు చేస్తానని ఒప్పుకుందట.
వీటిలో ఒకటి రామ్ చరణ్ హీరోగా శంకర్ రూపొందించే సినిమా కాగా.. మరొకటి రణ్ వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో చేసే ‘అపరిచితుడు’ రీమేక్ అన్నది తాజా సమాచారం. మరి ఆ మూడో సినిమా ఏంటో తెలియాల్సి ఉంది.