కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడని.. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడిగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దళపతితో అలాగే దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని.. ఆ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఈ కరోనా ప్యాండమిక్ తగ్గాక అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు. దాంతో విజయ్-వంశీ-దిల్ రాజు ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయింది.