దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.
షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆర్ఆర్ఆర్ యొక్క అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను సుమారు రూ.325 కోట్లకు కొనుగోలు చేసిందట.
ఒక సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం ఏకంగా రూ.900 కోట్లకు చేరిందట.