కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వాటి పాట, గుడ్ లక్ సఖితో పాటు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
అయితే తాజాగా కీర్తి సురేష్ను మరో బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, వంశీ పైడిపల్లి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు నిర్మించబోతున్నారట. ఈ చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయినట్టు బలంగా ప్రచారం జరుగుతోంది.
ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విజయ్కు జోడీగా కీర్తి సురేష్ను ఎంపిక చేశారట. ఇందులో భాగంగానే.. కీర్తిని సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.