ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడంతో.. వీరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పూజా హెగ్డే, దిశా పటాని,కియారా అద్వానీ వంటి పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా సమాచారం ప్రకారం.. దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి అయ్యాయని.. జాన్వీ కూడా మహేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే.. తెలుగులో జాన్వీ తొలి చిత్రం ఇదే అవుతుంది.