మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికే పూజా హెగ్డే, దిశా ప‌టాని,కియారా అద్వానీ వంటి పేర్లు వినిపించాయి.

Janhvi Kapoor once dressed up as a boy to help a friend?

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ భామ‌ జాన్వీ కపూర్ న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. జాన్వీ కూడా మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. తెలుగులో జాన్వీ తొలి చిత్రం ఇదే అవుతుంది.