ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఆ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను గోపీచంద్ ఇప్పటికే కన్ఫామ్ కూడా చేసేశాడు.
నిజ జీవిత సంఘటల ఆధారంగా వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి గోపీచంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. జులై నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట.
ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. కాగా, ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చాటుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోందంటూ టాక్ నడుస్తోంది.