కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం, టీకాలు వేసుకోవడం మాత్రమే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు.
గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో కొందరు వేసుకున్న మాస్కులు వైరల్ అవుతున్నాయి. గతంలో అమ్మాయి పెదవులు, డ్రాకులా బొమ్మలు ముద్రించిన మాస్క్లు ధరించింది అదా శర్మ. తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఎన్95 మాస్క్ ధరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ మాస్కుపై ఓ గులాబీ అలంకరించారు. మాస్క్ ధరిస్తే గడ్డం, మీసాలు కనిపించడం లేదనుకున్నారు కాబోలు, మాస్క్ మీద వాటికి ముద్రణ ద్వారా చోటు కల్పించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం వారు వేసుకున్న మాస్కులు వైరల్ అవుతున్నాయి.