కరోనా మహమ్మారి బాలీవుడ్ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశల్ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి పడ్నేకర్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్లడించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ మెడిసిన్ వాడుతున్నట్లు విక్కీ కౌశల్ తన ఇన్స్టాలో చెప్పాడు. తనని ఇటీవలే కలిసిన వాళ్ళందరిని టెస్టులు చేయించుకోవాలని విక్కీ కోరాడు. భూమి కూడా తనకు కొవిడ్ పాజిటివ్ తేలిన విషయాన్ని ఇన్స్టా ద్వారా చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అందరిని సూచించింది నటి భూమి.