రాజ‌మౌళి ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ప్ర‌భాస్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌..అపజయమే లేకుండా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. మ‌గధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్ట‌ర్‌గా ప్రఖ్యాత పొందారు.

అందుకే ఈయ‌న‌తో సినిమా చేసేందుకు ఎంద‌రో తార‌లు పోటీ ప‌డుతుంటారు. జ‌క్క‌న్న సినిమాలో చిన్న పాత్ర వ‌చ్చినా చాల‌నుకునే వారు ఎంద‌రో. కానీ, కొంద‌రు తార‌లు మాత్రం రాజ‌మౌళి పిలిచి మ‌రీ అవ‌కాశం ఇస్తానంటే వ‌ద్ద‌నుకున్నారు. అలాంటి వారిలో ప్ర‌భాస్ కూడా ఒక‌డు. వాస్త‌వానికి ప్ర‌భాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు అంటే అది రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం వ‌ల్లే.

మ‌రి అలాంటి రాజ‌మౌళి ఆఫ‌ర్‌ను ప్ర‌భాస్ వ‌దులుకోవ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాజ‌మౌళి జూనియర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం అప్ప‌ట్లో బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. అయితే ఈ సినిమా క‌థ‌ను ఎన్టీఆర్ కంటే మందు ప్ర‌భాస్‌కు చెప్పార‌ట‌. కానీ, ఇంత మాస్ కథను తాను హ్యాండిల్ చేయగలడా లేదా అనే అనుమానంతోనే జ‌క్క‌న్న ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌ను వ‌దులుకున్నాడ‌ట‌. ఇక ప్ర‌భాస్ మాత్ర‌మే కాదు.. శ్రీ‌దేవి, వివేక్ ఒబేరాయ్ త‌దిత‌రులు కూడా జ‌క్క‌న్న అఫ‌ర్ల‌ను వ‌దులుకున్నారు.