ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ టాఫిక్ ఎన్టీఆర్ బయోపిక్. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని, ఎన్టీఆర్ రోల్లో ఆయన తనయుడు బాలయ్య నటిస్తాడన్న వార్తలు సినిమా, రాజకీయ పరంగా కూడా సంచలనమయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సినిమాపై మామూలు అంచనాలు ఉండవు.
ఎన్టీఆర్ కేవలం తెలుగు ప్రజలకే కాకుండా, దేశవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ఆరాధ్యదైవం. ఈ బయోపిక్ను ఏ మాత్రం చెడగొట్టినా ఆ చెడ్డ పేరు బాలయ్యకు ఉండిపోతుంది. ఇక వర్మ డైరెక్టర్ అనడంతో ఈ సినిమాను వర్మ ఎలా డీల్ చేస్తాడ్రా ? బాబూ అని అందరూ తలలు కూడా పట్టుకుంటున్నారు.
ఈ టెన్షన్లు ఇలా ఉండగానే ఈ సినిమాపై ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు వర్మ-బాలయ్య కలిసి జై ఎన్టీఆర్ అన్న టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ సినిమా ద్వారానే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే ప్లాన్ కూడా దాదాపు ఖరారైందట. ఎన్టీఆర్ యువకుడిగా ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఉన్నప్పటి పాత్రను మోక్షుతో చేయించాలని వర్మ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
వర్మ ఐడియా బాగానే ఉన్నా…సినిమాను ఓ క్లాసిక్గా తీస్తే వర్మ చరిత్రలో నిలుస్తాడు. లేదంటే వర్మ ఎన్టీఆర్, టీడీపీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వక తప్పదేమో..?