ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్‌ జోక్‌

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలో మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజెపి కాస్త బతికిపోయిందంతే. వామపక్షాలకు కూడా చోటు లేకుండా పోయింది తెలంగాణలో. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చేశారు టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌. […]

ముద్రగడ మౌనం అందుకేనా?

ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్‌ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]

జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]

జగన్ తరహాలో రేవంత్ రెడ్డి దీక్ష!!

మల్లన్నసాగర్ ప్రాజెక్టు హట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌లో బాగంగా గోదావరి జలాల లను మెదక్, నల్గొండ జిల్లాలకు తరలించాలంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరాల్సిందేనని సర్కార్ స్పష్టం చేస్తుంది. దీనికోసం 14 గ్రామాల నుండి 37 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు సర్కార్ సిద్దపడింది. భూ నిర్వాసితుల కోసం 123 జిఓ కింద పరిహరం చెల్లించాలని నిర్ణియించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన నిర్వాసిత గ్రామాలు మూకుమ్మడిగా ఒక్కట య్యాయి. జెఎసిగా ఏర్పడి ఉద్యమాలకు శ్రీకారం […]

ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..

రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]

జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్‌!!

ఆయ‌న వైసీపీకు బాగా ప‌ట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులంద‌రికి పెద్ద ఇన్వెస్టర్‌. వైకాపా కార్యక్రమాల‌కు, ఆ పార్టీ నాయ‌కుల‌కు ఎప్పుడైనా ఎంత డ‌బ్బు కావాల‌న్నా క్షణాల్లో స‌మ‌కూరుస్తారు. జ‌గ‌న్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మక‌స్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రిత‌మే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ త‌ర‌పున రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో నాలుగో వ్యక్తిగా బ‌రిలో నిల‌వాల‌ని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం క‌లిసి ఈ అంశంపై చ‌ర్చించారు. […]

జగన్ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు!!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్‌’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా […]

జగన్‌ కంచుకోటలో చంద్రబాబు పాగా !

కడప జిల్లా అంటే వైఎస్‌ జగన్‌ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్‌ జగన్‌కి షాక్‌ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]