హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?

ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం […]

బ్లాక్ ఫంగస్‌ చికిత్స విషయంలో సీఎం కీలక నిర్ణయం..?

గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిస్తున్న కర్ఫ్యూను తాజాగా ఎటువంటి మార్పులు లేకుండా మే నెలాఖరు వరకు జగన్ సర్కార్ పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఇందులో భాగంగానే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో కీలక నిర్ణయం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి లో భాగంగా వచ్చే బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా తాజాగా ఆరోగ్యశ్రీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సీఎం జగన్ […]

గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ […]

సినీ గేయ రచయిత అదృష్టదీపక్ మృతి..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజాగా తెలుగు సినీ గేయ రచయిత, కవి అదృష్ట దీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన “ఆశయాల పందిరిలో అనురాగం […]

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!

కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన […]

బ్రేకింగ్ : రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..ఎందుకంటే..?

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో నర్సాపురం ఎంపీ, వైసీపీ నేత రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. నివేదికల ప్రకారం 30 మంది సీఐడీ అధికారులు 10 కార్లలో రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేయడానికి హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళ్లగా వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించారు ఐతే తమ ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు తాము అంగీకరిస్తామని సీఆర్పీఎఫ్ […]

ఏపీ మంత్రి ఇంట విషాదం..!

కరోనా టైంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల కుటుంబాల్లో కొందరు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు అనారోగ్యం వల్ల చనిపోతే మరికొందరు కరోనాకు బలైపోయిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం తన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణ […]

శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?

శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో […]

బ్రేకింగ్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ఎక్కడంటే.. ?

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ అయ్యింది. ఈ తరుణంలో అక్కడే పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి మృతి చెందారు. గ్యాస్ లీక్ అవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు […]