ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగల నిర్ణయాత్మక శక్తిగా మారాయి. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్లలో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాలని తన దగ్గరకు వచ్చిన గోదావరి జిల్లాల నేతలకు గట్టిగా చెబుతున్నారని సమాచారం! విభజన […]
Tag: chandrababu
టీడీపీకి, హోదా ఉద్యమానికి ఒకేసారి చెక్
ఏపీలో హోదా ఉద్యమం కేంద్రానికి తలనొప్పిగా మారింది! ప్రస్తుతం జల్లికట్టు కోసం తమిళ యువత చేసిన స్ఫూర్తి.. ఏపీ యువతకు ఆదర్శంగా మారింది. ఇప్పుడు ఏపీ ప్రజలు హోదా కోసం చేస్తున్న ఉద్యమం.. హోదా కోరుతున్న రాష్ట్రాల్లోని నాయకులకు స్ఫూర్తిగా మారితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాటు ఏపీకి హోదా ఇస్తామని మాట మార్చిందని, ఇక తప్పని పరిస్థితుల్లోనే అప్పుడు బీజేపీతో జత కట్టామని టీడీపీ హ్యాండ్ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు […]
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో లోగుట్టు…!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్రం, ఇటు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి వెనుక ఏదైనా దాగి ఉందా? నిజానికి విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారా? ప్యాకేజీ తీసుకోవడం వెనుక ఏదైనా గుట్టు దాగి ఉందా? అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. నిన్న జరిగిన విశాఖ ఆందోళన విఫలం అనంతరం, దీనిపై కేవీపీ ఢిల్లీలో స్పందించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన కేవీపీ.. చంద్రబాబు […]
టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!
అధికార టీఆర్ఎస్తో కలిసి అడుగులేయాలా? లేక పాత పద్ధతిలోనే టీడీపీతో జతకట్టాలా? అనే సందిగ్ధ పరిస్థితి తెలంగాణ బీజేపీ నాయకుల్లో నెలకొంది. ఒకపక్క సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోపక్క కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది. మరి ఇలాంటి విభిన్న పరిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. తెలంగాణలో పర్యటన హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ […]
ఆ ఇద్దరిపై బాబు కోపానికి అర్థాలు వేరయా.. ?
క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబు.. మరోసారి తానేంటో స్పష్టంచేశారు. క్రమశిక్షణ రహిత చర్యలకు పాల్పడుతూ.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇద్దరు మంత్రుల పనితీరు పార్టీకి తలనొప్పిగా మారిందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశధార నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం వహించిన అయ్యన్నపాత్రుడు, జానీమూన్ వ్యవహారంలో రావెల కిశోర్బాబులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. తోక జాడించే వారి విషయంలో కత్తెరకు పని చెబుతానని కూడా ఓపెన్ గా చెప్పేశారట. బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా […]
పరకాల ఉన్నది బాబు పరువు తీసేందుకేనా..!
ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారుగా కేంద్ర మంత్రి సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ను సీఎం చంద్రబాబు ఏరికోరి నియమించుకున్నారు. అయితే, ఆయన కొన్నాళ్లలోనే వివాదాస్పదమవడంతో సమాచార కమిషనర్ని నియమించిన చంద్రబాబు పరకాల పవర్స్ని కట్ చేశారు. సీఎం పరువు పోయేలా కామెంట్లు చేశారని పరకాలపై పలువురు నేతలు ఇంటర్నల్గా వ్యాఖ్యానించారు. ఇక, ఆ తర్వాత పరకాల మీడియాలో కనిపించడం దాదాపు తగ్గిపోయింది. దీనికి ముందు కేబినెట్ మీటింగుల్లో కూడా(అర్హత లేకపోయినా) కనిపించిన పరకాల ఆ తర్వాత అయిపు […]
చంద్రబాబు అటు – యనమల ఇటు
నోట్ల రద్దుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. నోట్ల రద్దుతో ఏపీకి లాభమని ఒకరు.. అబ్బెబ్బే లాభమేదీ లేదు అంతా నష్టమే అని మరొకరు!! నగదు రహిత లావాదేవీలతో ఏపీకి ఆదాయం బాగా పెరిగిందని సీఎం ఒకపక్క ఆనందం వ్యక్తంచేస్తుంటే.. నగదు రహితంతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైందని ఆర్థికమంత్రి యనమల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తొలుత స్వాగతించిన […]
మోడీపై టీడీపీ స్వరం పెరుగుతోంది
తడి తనదాకా వస్తేనే కానీ తెలీదంటారు పెద్దలు! ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయం టీడీపీకి ఇలానే మారుతోందట! మొన్నటి వరకు ఈ పెద్ద నోట్ల రద్దు విషయం మా నేత చంద్రబాబు చెబితేనేగానీ కేంద్రానికి అసలు ఆ ఆలోచనే లేదన్నట్టుగా మాట్లాడిన టీడీపీ తమ్ముళ్లు.. ఇప్పుడు ఆ నోట్ల రద్దుతో జనాలు ప్రభుత్వాలపై తిరగబడే పరిస్థితి తలెత్తేసరికి.. ప్లేటు ఫిరాయించేస్తున్నారు. ఈ పెద్ద నోట్ల విమర్శల నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటి […]
చంద్రబాబు అందుకే రాజకీయ మేథావి అయ్యాడు
కింద పడ్డా పైచేయి నాదే అనే టైపు పొలిటీషియన్లకు ఈ దేశంలో కొదవలేదు! ముఖ్యంగా ఏపీలో అయితే.. ఇంకో రెండాకులు చదివిన సీఎం చంద్రబాబు లాంటి నేతలకు అస్సలు కొదవలేదు!! ప్లస్ అయితే తన ఖాతాలోను, మైనస్ అయితే పక్కవాడి(విపక్షం) ఖాతాలోను వేయడం బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలీదని అంటారు పొలిటికల్ పండితులు. 2009 ఎన్నికల్లో అప్పటి వైఎస్ ధాటికి టీడీపీ మట్టి కరిచింది. ఇది నిజం! ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే సైడైపోయిన చంద్రబాబు అండ్కో.. […]
