సెంటిమెంట్ అస్త్రాలతో టీడీపీ, వైసీపీ ఎన్నికల షో!

క‌ర్నూలు జిల్లా నంద్యాల నుంచి 2014లో ఎన్నికైన సీనియ‌ర్ రాజ‌కీయ నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే, గ‌తంలోనూ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జ‌రిగినా.. అవి ఏక‌గ్రీవంగా జ‌రిగిపోయాయి. ఎవ‌రూ పోటీకి నిల‌బెట్ట‌లేదు. కేవ‌లం సానుభూతితో వాటిని ఏక‌ప‌క్షం చేశారు. కానీ, నంద్యాల విష‌యంలోకి వ‌చ్చేస‌రికి.. మాత్రం అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ నేత‌లు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా […]

ఎక్స్‌క్లూజివ్‌: న‌ంద్యాల టీడీపీ క్యాండెట్ డిక్లేర్‌

ఏపీలో ఇటీవ‌ల ఖాళీ అయిన క‌ర్నూలు జిల్లా నంద్యాల శాస‌న‌స‌భా స్థానం ఉప ఎన్నిక‌కు టీడీపీ అభ్య‌ర్థి దాదాపు ఖ‌రారైన‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో నంద్యాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఇక్క‌డ నుంచి తాము కూడా బ‌రిలో ఉంటామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్ప‌డంతో ఉప ఎన్నిక త‌ప్పేలా లేదు. దీంతో అధికార టీడీపీ వ‌ర్సెస్ విప‌క్ష వైసీపీ మ‌ధ్య నంద్యాల […]

నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిక‌తో మొద‌లైన విభేదాలు.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా చ‌ల్లార‌డం లేదు. భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి త‌లనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలతో తీవ్రంగా న‌లిగిపోయిన అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఇప్పుడు స‌రికొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా శిల్పా వ‌ర్గానికి […]

నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్క‌లాట‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జ‌ర‌గ‌నుంది. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మ‌రో రెండు వ‌ర్గాలు చాప‌కింద నీరులా అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్న‌ల్స్ పంపుతున్నారు. ముందుగా మాజీ మంత్రి […]

నంద్యాలలో చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ చేసిన జ‌గ‌న్‌

ఇటీవ‌ల ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో అక్క‌డ ఐదారు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావ‌న అప్పుడే ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. దీనిపై విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుగానే డెసిష‌న్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు త‌మ‌దే అని…అక్క‌డ నుంచి వైసీపీ ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో నంద్యాల‌లో ఉప ఎన్నిక ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి […]

భూమా వ‌ర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌రణంతో.. ఆయ‌న వ‌ర్గం దిక్క‌లేనిది అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ నంధ్యాల‌లో ప‌రిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియ‌క తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డింది పార్టీ అధిష్ఠానం! ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను పూర్తిగా త‌మ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టి వ‌రకూ బ‌లంగా ఉన్న భూమా వ‌ర్గాన్ని బల‌హీనం చేసేందుకు వెనుక నుంచి శ‌ర వేగంగా పావులు క‌దుపుతోంది. నంద్యాల రాజ‌కీయాల‌ను తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆస‌క్తిక‌రంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఉప […]

విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా

నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]

భూమా మృతికి సంతాప‌మా? ఎన్నిక‌ల ప్ర‌చారమా?

కాదేదీ క‌వితక‌నర్హం అన్నాడో మ‌హాక‌వి!! ఇప్పుడు కాదేదీ రాజ‌కీయాల‌క‌న‌ర్హం అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు! ఏ అంశాన్న‌యినా రాజ‌కీయాన్ని చేసి.. దానిని త‌మ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోవ‌డం ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుల‌కు వెన్నతో పెట్టిన విద్య‌! క‌రెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మ‌ర‌ణాన్ని కూడా ఎవ‌రికి వారు.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు. చివ‌రికి ఆయ‌న‌కు సంతాప స‌భ కూడా రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]

భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..

క‌ర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేత‌ల‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంది. ఆయ‌న లేరన్న వార్త అంద‌రినీ శోక‌సంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయ‌న గుండెపోటుతో మృతిచెందార‌న్న విష‌యం.. అంద‌రిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మ‌రి పెద్ద వ‌య‌స్సు కాక‌పోయినా భూమా 53 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఇంత త్వ‌ర‌గా మృతి చెంద‌డానికి నాలుగు కార‌ణాలు ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నాయి. […]