ఏపీ క్యాబినెట్లో దీపావళికి కాస్త అటూ ఇటూగా ప్రక్షాళన జరగడం ఖాయమని, కొందరు కొత్త సభ్యులకు మంత్రివర్గంలో స్థానం దక్కనుందనీ, అదే సమయంలో కొందరు పాత కాపులకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ టీడీపీ అధిష్ఠానం కొంతకాలంగా సంకేతాలు పంపుతూ వస్తోంది. ఇక ఇప్పుడు దీపావళి సంబరాలు ముగిసినట్టే.. మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని పార్టీలోని ఆశావహులు సహజంగానే ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కొత్తగా ఎవరెవరిని మంత్రిపదవులు వరించనున్నాయనేది ఆసక్తికరంగానే కనిపిస్తోంది. […]