రాజకీయాల్లో ప్రత్యర్థుల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంటనే మనం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్లకు ఇతర పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొందరు వేగులు / కోవర్టులు ఉంటుంటారు. ఈ క్రమంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్రత్యర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద టెన్షన్ పట్టుకుందట.
వరుసగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తోన్న చంద్రబాబు ఇటీవల తనకు బాగా కావాల్సిన సన్నిహితులతో మీట్ అయ్యారట. ఈ సమావేశంలో చంద్రబాబు మనం అమలు చేస్తోన్న అని పథకాల్లోను పెన్షన్ పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోందని, ఈ పథకంలో అవినీతి కూడా చాలా తక్కువుగా జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారట. ఈ పథకానికి వస్తోన్న రెస్పాన్స్ దృష్ట్యా పెన్షన్ను నెలకు రెండు వేల రూపాయలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ అక్కడ లేవనెత్తారట.
చంద్రబాబు ఈ మాట అన్న నాలుగు రోజులకే అమరావతిలో వైసీపీ ప్లీనరీ జరిగింది. ఈ ప్లీనరీలో జగన్ పెన్షన్ను నెలకు రూ. 2 వేలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో చంద్రబాబుకు దిమ్మతిరిగిపోయిందట. తనకు బాగా కావాల్సిన సన్నిహితులతో చర్చించిన విషయం ఎలా లీక్ అయ్యింది ? జగన్ వద్దకు ఎలా వెళ్లిందని ఆయన ఇప్పుడు ఆరా తీస్తున్నారట. తాను ఆ రోజు ఎవరెవరితో మీట్ అయ్యానో వాళ్లపై నిఘా వేయాలని ఇంటిలిజెన్స్కు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక టీడీపీలో కోవర్టులు ఇప్పుడే కాదు. గతంలో జగన్ తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు జనాలను తన వైపునకు తిప్పుకునేందుకు కిలో రెండు రూపాయల బియ్యం పథకం అమలు చేస్తే ఎలా ఉంటుందని పార్టీలో తన సన్నిహితులతో ప్రస్తావించారట. ఇది జరిగిన కొద్ది రోజులకే వాళ్లలో ఎవరో ఈ విషయాన్ని లీక్ చేయడంతో అప్పటికప్పుడు వైఎస్ ఆఘమేఘాల మీద కిలో రెండు రూపాయల బియ్యం పథకం అమలు చేసేశారు.
ఇలా నాడు వైఎస్ నుంచి, నేడు జగన్ వరకు తమ సీక్రెట్లను వాళ్లకు ఎవరు చేరవేస్తున్నారా ? అని చంద్రబాబు ప్రత్యేక నిఘా ద్వారా ఆరా తీసేపనిలో ఉన్నారట. మరి ఈ ఇంటి దొంగలను బాబు అదుపు చేయకపోతే వీరు ఇంటిగుట్టు అంతా ప్రత్యర్థులకు లీక్ చేసేయడం ఖాయం.