పవన్‌పై మరోసారి నోరు పారేసుకున్న శ్రీరెడ్డి… బూతులే బూతులు..!

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినవారు ఎందరో ఉన్నారు. వారిలో మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ రెడ్డి. ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఈమె తరచూ సెలబ్రిటీలు అండ్ రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక శ్రీరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనితా పై సోషల్ మీడియాలో ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది.

దీంతో శ్రీ రెడ్డి పై పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇకపోతే ఈమె తాజాగా ట్విట్టర్లో సంచలన పోస్ట్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పై వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్..” నాడు నేడు అమ్మ ఒడి, దీవెనలు, కానుకలు.. ఇలా ఒకటి కాదు.. నోటికి వచ్చిన పేర్లన్నీ పెట్టుకున్నారు.

మామయ్య వస్తున్నాడు చెప్పండి. పలక బలపం పట్టుకుని అఆఇఈలు రాయిస్తే కాదు..అంటూ గతంలో చెప్పిన మాటలకు.. సంక్షేమ పథకాల్ని మేం అపం. కచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ అలాగే నడుస్తాయి. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం తప్ప తక్కువ చేయాలనుకోవడం లేదు ” అంటూ ఇటీవల పవన్ మాట్లాడిన మాటలకు జోడించి శ్రీరెడ్డి వీడియో ఎడిట్ చేసింది. అంతేకాకుండా జఫ్ఫా, సిగ్గులేని వెధవా అని తిట్టే ఏమోజీలను ఎడిట్ చేసి చివర్లో పవన్ కళ్యాణ్ కింద కూర్చుని ఏడ్చే ఓ సినిమాలోని సీన్ ను జోడించింది. ప్రస్తుతం శ్రీరెడ్డి పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.