ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింత వైరల్ గా మారింది . ఏపీలో కూటమి అధికారం చేపట్టబోతుంది . ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఇన్నాళ్లు వైసిపి ప్రభుత్వం అరాచకాలతో విసిగిపోయిన ఏపీ జనాలకు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ వచ్చింది . త్వరలోనే సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు . కాగా గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేట్ చైర్మన్లు పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తూ ఉండగా త్వరలో కూటమి ప్రభుత్వం తరఫున కొత్త వాళ్ళని నియమించబోతున్నారు ఏపీ కి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .
ఈ క్రమంలోనే ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశాడు . అయితే ఇప్పుడు ఆ పదవిలో ఎవరు రాబోతున్నారు అనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ పదవి కోసం ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఒక స్టార్ పేరుని నియమించారట . ఈ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుంది అంటూ టాక్ వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు అశ్విని దత్ మంచి జాన్ జిగిడి దోస్తులు . చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయనకు ఓపెన్ గానే సపోర్ట్ చేశాడు అశ్విని దత్. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు . కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో టీటీడీ చైర్మన్ పోస్ట్ అశ్విని దత్ కి వెళ్ళబోతుంది అన్న న్యూస్ యమ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాదా అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కాబోతుంది ..!!