మట్టి కుండలో నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మర్చిపోకండి..?!

వేసవికాలం వచ్చేసింది.. అందరూ చల్లని నీరు తాగాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే కొందరు హెల్దిగా ఉండేందుకు ఫ్రిజ్ నీటి కంటే మట్టి కుండలో ఉంచిన నీరు తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేలలోని తీపి పరిమ‌ళం కూడా చల్లదనానికి తోడవుతుంది.. అలాగే ఆరోగ్యానికి చాలా మెరుగవుతుందని అంత భావిస్తూ ఉంటారు. ఫ్రీజ్ ఉన్న కుండలో నీరే తాగాలనుకుంటారు. ఇక మట్టికొండలో నీరు తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకే వీటికి చాలా ఇళ్లల్లో ప్రిఫరెన్స్ ఇస్తారు.

కానీ శుభ్రం చేసేటప్పుడు ఈ విషయాలను మర్చిపోవడం వల్ల మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. కుండలు దేనితో శుభ్రం చేయాలి.. సరైన పద్ధతి ఏంటో ఒకసారి చూద్దాం. కుండలో చల్లని నీరు తాగడం వల్ల.. దాహం తీరడమే కాదు కనిజాలు కూడా పుష్కలంగా అందుతాయి. కుండనీటిలో ఆల్కలీన్‌ లక్షణాలు శరీరం యొక్క పీహెచ్ స్థాయిని నిర్వహించడంలో సహకరిస్తాయి. యాసిడ్ రెఫ్లెక్స్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొదటిసారిగా కొత్త కొండల నీటిని నింపుతున్నప్పుడు దానికోసం 12 గంటలు నీటిలో నానబెట్టి ఆపై ఉప్పు వేసి స్క్రబ్బర్తో పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే నీటి కుండను వాడాలి.

ఆపై కుండను శుభ్రం చేయడానికి ఓ చెంచా బేకింగ్ పౌడర్.. ఒక చెంచా వైట్ వెనిగర్.. ఒక చెంచా ఉప్పును నీటిలో కలిపి ఆ ద్రవాన్ని తయారు చేసి దాన్ని కుండలో పోసి బాగా తిప్పాలి. తర్వాత స్క్రబ్బర్తో శుభ్రం చేయడం వల్ల కుండలో నీరు శుభ్రంగా ఉంటుంది. ఇక కుండను దాదాపు 8 నుంచి 9 నెలల వరకు వాడుకోవచ్చు. ఒకసారి కుండలో నీరు చల్లబడడం లేదు అనిపించినప్పుడు దాని వాడటం మానేస్తే మంచిది.