గత కొద్దిరోజులుగా బెంగళూరు రేవ్ పార్టీకి సంభందించిన వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేవ్ పార్టీకి సంబంధించిన మరో కీలక ట్విస్ట్ వైరల్ గా మారింది. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్కు సంబంధించిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారంటూ అందులో నటి హేమ, శ్రీకాంత్, యాంకర్ శ్యామల ఇలా ఎంతోమందిని ఇన్వాల్వ్ చేస్తు నెటింట వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన వీరంతా మేము వేరే పార్టీకి వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
కాగా హేమ ఏ రేవ్ పార్టీకి నేను వెళ్లలేదు.. హైదరాబాదులో నా ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్న అంటూ ఓ వీడియోని రిలీజ్ చేసిన కొంతసేపటికే.. బెంగళూరు పోలీసులు ఆమె బెంగళూరు రేవ్ పార్టీలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అమ్మడికి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ అనేవాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 150 మంది బ్లడ్ శాంపిల్స్ ను నార్కోటిక్ టీం సేకరించి ల్యాబ్స్ కు పంపించారని.. అందులో 57 మంది పురుషులు 27 మంది మహిళలు బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రూఫ్ అయిందంటూ అధికారులు వెల్లడించారు.
కాగా నటి హేమా మాత్రం ఇప్పటికీ తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ చెప్పుకొస్తుంది. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయి అంటూ అర్జీవితో తాజాగా హేమ వివరించింది. అయితే హేమ ఆర్జీవితో చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఎదురుగా ప్రూఫ్ కనపడుతున్నా.. బొకాయిస్తూ నేను చేయలేదంటూ మాట్లాడడానికి సిగ్గు లేదా అంటూ.. తప్పు చేసి ఎదవ కవరింగ్లు ఎందుకు అంటూ.. హేమ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.