తెలుగు బుల్లితెరపై భారీపాపులారిటీ దక్కించుకున్న త్రినయని సీరియల్ ఫేమ్ చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ ఇటీవల సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన సూసైడ్ ప్రస్తుతం టాలీవుడ్ వినోద పరిశ్రమలో సంచలనంగా మారింది. ఆరేళ్లుగా వివాహేతర బంధంతో కొనసాగుతున్న అతని భార్య పవిత్ర జయరాం మరణించడంతో కొద్దిరోజులకే తన నివాసంలో ఉరి వేసుకుని మరణించి అందరికి షాక్ ఇచ్చాడు చంద్రకాంత్. దీంతో టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈయన ఆత్మహత్యకు ముందు తన వాట్స్అప్ చాట్ లో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తన భార్య పవిత్ర జయరాం మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిన చందు.. కళ్ళముందు ఆమె మరణించడం జర్ణించుకోలేక పోయాడు.
తన స్నేహితులతో బాధను వెళ పుచ్చుకుంటూ పవిత్రలేని జీవితం నాకు వద్దు.. ఆమె లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతా.. లేదా తాగుబోతునై చెడ్డ పేరు తెచ్చుకుంటా.. ఇలా కుటుంబ సభ్యులను బాధ పెట్టడం కన్నా నేను చనిపోవడమే మంచిది అంటూ.. వెల్లడించాడని స్నేహితులు చెబుతున్నారు. ఆయన తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లోనూ ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్న.. ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సప్ ద్వారా వివరించినట్లు వెళ్లడయింది.
చందు పంపిన వాట్సప్ చాట్ మొత్తం తన ప్రాణ స్నేహితులు మీడియాకు, పోలీసులకు షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ గా మారింది. అయితే తాము ఎంత నచ్చచెప్పిన డిప్రెషన్ లోకి వెళ్లిన ఆయన.. ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు అని స్నేహితులు వివరించారు. ఇక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య పాల్పడిన చందు పార్థివదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. అనుమానస్పద మృతిగా ప్రాథమిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.