సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత చాలా మంది తమ రేర్ ఫోటోలు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల ఫోటోలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్స్ లేటేస్ట్ గ్లామర్ పిక్స్ దగ్గర నుంచి, సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోల వరకు అన్నీ నిటింట ట్రెండ్ అవుతున్నాయి. అలా తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ సినీ సెలబ్రేటీ ఫోటో నిటింట వైరల్ గా మారింది. ఇంతకు ఆ పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె అందానికి, గొంతుకు మైమరిచిపోని వారు ఎవరు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలను టాలీవుడ్కు అందించిన ఈ ముద్దుగుమ్మ.. చాలామంది స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది.
ఇంతకు అమె ఎవరో గుర్తుపట్టారా.. అచ్చ తెలుగు అడపడుచు.. తెలుగింటి అందం అంటే ఆమెనే గుర్తుకు వస్తుంది. ఇంతకు ఆమె ఎవరోకాదు.. మైక్ పట్టుకొని పాటను ఆలపిస్తున ఆమె టాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ సునీత. ఎన్నో వందల పాటలకు గాత్రం అందించిన సునీత. అలాగే చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పింది. ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది.. ఇప్పటికి కూడా అదే అందం.. అంతే మధురమైన గానంతో ఆకట్టుకుంటుంది సునీత. ఇటీవలే సునీత రెండో పెళ్లి చేసుకున్ని మరోసారి మ్యారేజ్ లైఫ్లోకి అడుగుపెట్టింది.
ఇక ఈమె కొడుకు కూడా లాజాగ ఓ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెపించలేదు. అయినా తన నటనతో ప్రేక్షకులను అకటుకున్నాడు సునీత కొడుకు ఆకాష్. ఇక సునీత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇక ఈ పై ఫోటో సరిగా చూస్తే సునీత కెరీర్ బిగినింగ్ లోదని అర్ధం అవుతుంది.. అప్పట్లో సీనియర్ సింగర్స్, యంగ్ సింగర్స్ కలిసి సరదాగా అంత్యాక్షరి నిర్వహించగా అందులో సునితా పాట పాడుతున్న టైంలో క్లిక్ అయిన ఫోటో ఇది.