అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన హలో మూవీ తో టాలీవుడ్కి పరిచయమైంది యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ మంచి సక్సెస్ లతో దూసుకుపోతోంది. తన క్యారెక్టర్ కు ప్రయారిటీ ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా వితంతువుల కు అండగా నిలబడింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.
ఇటీవల కేరళ ప్రభుత్వం ‘ అమ్మక్కిలికుడు ‘ పేరుతో వితంతువులకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఎమ్మెల్యే అన్వర్ సాదత్ అండ్ టీం ఈ ప్రాజెక్టు కు అర్హులైన వారి లిస్టు తయారుచేసి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా 50 ఇళ్లను నిర్మించి విడోస్ కు ఇచ్చారు. సఫియాత అనే ఓ వితంతువుకు ఇంటిని పంపిణీ చేసేందుకు కళ్యాణిని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయినా కళ్యాణి.. ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎంత అవసరమో సఫియాత ఆనందాన్ని చూస్తే అర్థమవుతుంది అంటూ వివరించింది.
మహిళలకు రక్షణ అందిస్తున్న ‘ అమ్మక్కిలికుడు ‘ అర్హులందరికీ అందాలని భావిస్తున్నాను అంటూ వివరించింది. ఈ మంచి విషయంలో చిన్న పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోస్ ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారడంతో ఇలాంటివారు పిలిచినా చాలామంది సెలబ్రిటీస్ హీరోయిన్స్ వెళ్లాలనుకోరు. అలాంటిది వారికి అండగా నిలుస్తూ హౌస్ ఓపెనింగ్కు వెళ్లి వారిని చాలా సంతోష పెట్టారు. మీరు చాలా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్లు.
View this post on Instagram