దేశవ్యాప్తంగా దివాళి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు . చిన్న – పెద్ద , కుల – మతం ..తేడా లేకుండా అందరూ ఈ ఫెస్టివల్ ని చాలా ఘనంగా జరుపుకున్నారు . పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం దీపావళి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్చర్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు .
కాగా ఇలాంటి క్రమంలోని మెగాస్టార్ చిరంజీవి కొడుకు చరణ్ ఇంట దివాళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అయితే మెగా ఫ్యామిలీ ఈసారి అందరు స్టార్ హీరోలను పిలిచి గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనలకి క్లిం కారాకు జన్మనిచ్చిన శుభ సందర్భంగా ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ దీపావళి కావడంతో అందరికీ పెద్దగా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి -అక్కినేని నాగార్జున -విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – వరుణ్ తేజ్ – మంచు మనోజ్ ..వాళ్ల భార్యలతో వచ్చారు.
అఖిల్ , అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరు హీరోలు అక్కడికి వాలిపోయారు . అయితే వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . కానీ ఎక్కడా కూడా నందమూరి బాలకృష్ణ కనిపించలేదు . దీంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇంతమంది హీరోలను పిలిచిన నువ్వు మా బాలయ్యను పిలవకుండా అలాగే ఉండిపోయావా..? చరణ్ కి తెలియకపోయినా నువ్వు చెప్పాలి కదా .. ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో మన శ్రేయోభిలాషి ..ఆయనని కూడా పిలవాలి అని.. నువ్వు పిలిస్తే బాలయ్య ఎందుకురారు అంటూ ఫుల్ ఫైర్ అయిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!
చిరంజీవి కి కళ్లు నెత్తికెక్కాయా..? మా బాలయ్య నీ కంటికి కనపడడా..?
