కృష్ణం రాజు చనిపోయే ముందు..ప్రభాస్ చేత అలాంటి ప్రామిస్ చేయించుకున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ బాహుబలి సినిమా తర్వాత పెద్దగా హిట్స్ కొట్టని..ఈ ప్రభాస్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్న రేంజ్ లో ముందుకు వెళ్తున్నారు. మనకు తెలిసిందే కృష్ణంరాజు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రభాస్.

ఈ మధ్య కాలంలోనే కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన మరణం అభిమానులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ప్రభాస్ ఆయన మరణం తలుచుకొని ఎలా కుమిలి కుమిలి ఏడ్చాడో మనం చూసాం. ఆ విజువల్స్ ఇంకా మన కళ్ళ ముందు నుంచి డిలీట్ అవ్వలేకపోతున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే కృష్ణంరాజు ఇక నేను మరణిస్తాను అని తెలిసిన కొన్ని నిమిషాల ముందు ప్రభాస్ చేత ఓ ప్రామిస్ చేయించుకున్నాడట .

ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్లకి లేదు కాదు అనకుండా వాళ్లు అడిగింది ..కోరింది చేసి పెట్టాలి ..అది ఇప్పటివరకు నేను చేశాను.. నా తర్వాత ఆ బాధ్యతలను నువ్వే తీసుకోవాలి ..నువ్వు అలా చేస్తావని నమ్మకం నాకుంది .. అంటూ ప్రభాస్ చేత ప్రామిస్ చేయించుకున్నాడట . ప్రభాస్ కూడా పెదనాన్న అడిగిన కోరిక ఖచ్చితంగా తీరుస్తాను అంటూ ఆయనకు మాటిచ్చారట . ఆయన ప్రామిస్ చేయించుకున్న కొన్ని నిమిషాలకు కృష్ణంరాజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి..!!