బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో డేబ్యూ ఇస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న దేవర సినిమాలో ఆమె మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ తెలుగులో ముందే ఎంట్రీ ఇవ్వాల్సి ఉండింది .
ఆ సినిమా మరేదో కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ . అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా తీసుకున్నారు . అయితే నిజానికి ఈ సినిమాలో జాన్వి కపూర్ ను హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారట డైరెక్టర్. కానీ అప్పటివరకు ఫుల్ ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో అన్న భయంతో బోనీకపూర్ రిజెక్ట్ చేశారట.
ఫైనల్లీ ఈ సినిమాతో ఒక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అఖిల్..అలా అఖిల్ తో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మిస్ అయిపోయింది జాన్వి. మొత్తానికి సినిమా వదులుకుని మంచి పనే చేసింది అమ్మడు అంటున్నారు శ్రీదేవి ఫ్యాన్స్..!!