టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి మరీ దారుణంగా మారింది. గత ఏడాది కాలం నుంచి దాదాపు అర డజన్ ఫ్లాపులను మూటగట్టుకుంది. దీంతో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉన్న పూజా హెగ్డే వైపు ఇప్పుడు స్టార్ హీరోలు కన్నెత్తి కూడా చూడటం లేదు. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబోలో ప్రారంభమైన `జన గణ మన`లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ, లైగర్ దెబ్బకు ఈ మూవీ ఆగిపోయింది.
మహేష్ బాబు `గుంటూరు కారం`తో అయినా పూజా హెగ్డే ఫామ్ లోకి వస్తుందని భావించారు. అయితే అనివార్య కారణాలతో పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్`లో మొదట బుట్టబొమ్మనే హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ, పలు కారణాల వల్ల ఈ మూవీ నుంచి సైతం పూజా హెగ్డే తప్పుకోవడంతో.. శ్రీలీలను హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేక సతమతం అవుతున్న పూజా హెగ్డేకు తాజాగా ఓ ఆఫర్ వచ్చింది. ఇటీవల విరూపాక్ష మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేను సంప్రదించగా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మామ పవన్ కళ్యాణ్ను వదిలేసి ఆయన మేనల్లుడు తేజ్ ను తగులుకున్న పూజా హెగ్డేకు.. ఈ సినిమా అయినా వర్కోట్ అయ్యేనా.. లేదా.. అన్నది చూడాలి.