ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా పద్ధతిగా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ మీరాజాస్మిన్.. అచ్చ తెలుగు అమ్మాయిగా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో గ్లామర్ తో అవకాశాలు అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మీరాజాస్మిన్ మొదట అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న మీరాజాస్మిన్ ఆ తర్వాత రవితేజ తో కలిసి భద్ర సినిమాలో నటించింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో తెలుగు తోపాటు తమిళంలో కూడా మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఊహించని విధంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన మీరాజాస్మిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అందాలతో ఆకట్టుకోవడానికి ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. మీరాజాస్మిన్ ఫోటోలు చూసిన పలువురు నేటిజన్లు రోజు రోజుకి మీరాజాస్మిన్ వయ్యారాలు ఒలకబోస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజాగా మీరాజాస్మిన్ విమానం అనే సినిమాతో రీయంట్రి ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంలో ఈమె ఎయిర్ పోస్టుగా కనిపించింది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా మీరా జాస్మిన్ మాట్లాడితే సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇవ్వవలసి వచ్చిందో తెలియజేసింది. హీరోయిన్గా రాణించినందుకు తనకు చాలా గర్వకారణంగా ఉందని ఇంకా మెరుగైన సినిమాలను నటించడానికి రాణించడానికి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నారని తెలియజేసింది మీరాజాస్మిన్. అయితే ఇప్పుడు తిరిగి సినిమాలలో నటిస్తూ ఉంటే తనకు ఒక కొత్త ప్రయాణంలో మొదలుపెట్టిన ఫీలింగ్ కలుగుతోంది అంటూ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మీరాజాస్మిన్ చేసిన ఈ కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి.