ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మరోసారి సెట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ వన్స్ మోర్ అంటున్నాడు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే నాలుగో సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మితం కాబోతోంది. ఈ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత మూడు చిత్రాలతో పోల్చితే ఈ సినిమా మరింత అద్భుతంగా ఉండబోతోందని అభిమానులు భావిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంటుందట. ఈ రోల్ స్క్రీన్ టైమ్ దాదాపు పది నిమిషాలు ఉంటుందట. అయితే ఈ రోల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య ఎలాంటి సన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ పవర్ స్టార్ ను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పూజకాలే అని అంటున్నారు.