అల్లు అర్జున్ కోసం ప‌వ‌ర్ స్టార్ ను దింపుతున్న త్రివిక్ర‌మ్‌.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబో మ‌రోసారి సెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వ‌చ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో అల్లు అర్జున్ వ‌న్స్ మోర్ అంటున్నాడు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్క‌బోయే నాలుగో సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మితం కాబోతోంది. ఈ మూవీపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత మూడు చిత్రాల‌తో పోల్చితే ఈ సినిమా మరింత అద్భుతంగా ఉండ‌బోతోంద‌ని అభిమానులు భావిస్తున్నారు. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక‌పోతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉంటుంద‌ట‌. ఈ రోల్ స్క్రీన్ టైమ్ దాదాపు ప‌ది నిమిషాలు ఉంటుంద‌ట‌. అయితే ఈ రోల్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఎలాంటి స‌న్నిహిత్యం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ కోసం త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ స్టార్ ను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ కి పూజ‌కాలే అని అంటున్నారు.