సుదీర్ఘ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. రీసెంట్ గా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటిలోనూ బోల్డ్ యాక్టింగ్ తో తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ స్టార్ కిడ్స్ లో రామ్ చరణ్, నాగ చైతన్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తదితర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వారితో వర్కింగ్ అనుభవాలను పంచుకుంది.
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ కిడ్స్ తో తాను వర్క్ చేశానని.. వారంతా చాలా మంచి ప్రవర్తన కలిగిన హీరోలని తమన్నా కొనియాడింది. ఎంతో సంస్కారవంతులు, తోటి నటీనటుల పట్ల గౌరవప్రదంగా ఉంటారు. అలాగే చాలా ధైర్యవంతులు అంటూ తమన్నా గొప్పగా చెప్పుకొచ్చింది. వారితో వర్క్ చేసేటప్పుడు ఫుల్ కంఫర్ట్ గా ఉంటుందని తమన్నా తెలిపింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. కాగా, తెలుగులో ఇప్పుడు తమన్నా చిరంజీవికి జోడీగా `భోళా శంకర్` చేస్తోంది. తమిళంలో రజనీకాంత్ తో `జైలర్` మూవీలో భాగమైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు వచ్చే నెలలో విడుదల కాబోతున్నాయి.