మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు.
దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా తగులుకున్నారు. ఈ క్రమంలో పవన్..తన ఫ్యాన్స్ చేత తిట్టిస్తున్నారని, వాళ్ళు తిడుతుంటే రాజకీయాల్లోకి వచ్చి పోరాడాలనే కసి తనలో పెరుగుతుందని అన్నారు. ఇక ముందు చెప్పినట్లు కాకినాడ సిటీలో ద్వారంపూడిపై పోటీచేసి గెలవాలని, లేదంటే పిఠాపురంలో పోటీ చేసి అక్కడ తనని పోటీకి ఆహ్వానించాలని ముద్రగడ అన్నారు. అంటే ముద్రగడ పిఠాపురం బరిలో దిగుతారని తెలుస్తుంది. ఇక వైసీపీలో చేరి పిఠాపురం బరిలో పోటీ చేస్తారని తెలుస్తుంది.
మరి అక్కడ పవన్ని పోటీ చేయాలని ముద్రగడ ఆహ్వానిస్తున్నారు.అంటే పిఠాపురంలో గెలిచేస్తామనే ధీమా ముద్రగడకు ఉంది. అయితే పిఠాపురంలో ముద్రగడ గెలవగలరా అంటే? టిడిపి, జనసేన విడిగా పోటీ చేస్తే గెలుస్తారు..కలిసి పోటీ చేస్తే గెలవలేరు. గత ఎన్నికల్లో పిఠాపురంలో వైసీపీకి 83 వేల ఓట్లు రాగా, టిడిపికి 68 వేలు, జనసేనకు 28 వేలు ఓట్లు వచ్చాయి. అంటే టిడిపి, జనసేన ఓట్లు కలిపితే 96 వేలు..ఈ ఓట్లు వైసీపీ కంటే 13వేలు ఎక్కువ.
ఇది గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో వచ్చిన ఓట్లు ..ఇప్పుడు ఆ గాలి తగ్గింది. టిడిపి, జనసేన బలపడ్డాయి. దీంతో ముద్రగడ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమే. పవన్ డైరక్ట్ బరిలో దిగితే ముద్రగడకు ఇంకా రిస్క్ ఎక్కువ.