ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]

పిఠాపురం బరిలో ముద్రగడ..పవన్‌కు సవాల్..గెలవగలరా?

మొన్నటివరకు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ ముసుగు తీసి తాను జగన్‌కు విధేయుడుని అనే చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల పవన్..కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఫైర్ అవుతూ వస్తున్నారు. గతంలో తనని బూతులు తిట్టడం, తమ పార్టీ మహిళా నేతలతో దాడులు చేయడంతోనే పవన్..ద్వారంపూడిని టార్గెట్ చేశారు. ఇక ద్వారంపూడిని టార్గెట్ చేయడంతో ముద్రగడ..పవన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేన శ్రేణులు ముద్రగడని గట్టిగా […]

గంటా-ముద్రగడలతో జగన్ ‘కాపు’ రాజకీయం..!

రాష్ట్రంలో కొన్ని వర్గాలు అధికార వైసీపీకి దూరమవుతున్నాయనే చెప్పాలి..గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఉండటంతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక..అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా జగన్ పాలన సాగుతుందా? అంటే ఆ విషయం ఆయా వర్గాల ప్రజలకే బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యే పరిస్తితి. ఇందులో మొదటగా కమ్మ వర్గం బాగా దూరమైంది..ఎందుకు దూరమవుతుందో […]

కాకినాడ‌లో టీడీపీ గెలుపున‌కు ముద్ర‌గడ ఇలా హెల్ఫ్ చేశారా…

ఏపీలో వారం రోజులు తిర‌క్కుండానే అధికార టీడీపీకి రెండో గుడ్ న్యూస్‌. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఈ రోజు కాకినాడ‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లోను స‌త్తా చాటింది. నంద్యాల‌లోలాగానే కాకినాడ‌లోను వార్ వ‌న్‌సైడ్ అయిపోయింది. నంద్యాల‌లో సానుభూతి సెంటిమెంట్ బాగా ప‌నిచేసింద‌ని, మంత్రులంతా అక్క‌డే దిగిపోయార‌ని, చంద్ర‌బాబు ఏకంగా రూ.1200 కోట్లు రిలీజ్ చేశార‌ని, అధికార దుర్వినియోగం జ‌రిగిపోయింద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. స‌రే జ‌గ‌న్ చెప్పిన దాంట్లో కూడా కాస్త […]

కాకినాడపై ముద్రగడ ప్రభావం ఎంత? 

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లోని 48 వార్డుల‌కు ఈ నెల 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా త‌మ‌ది అభివృద్ధి అజెండా అని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ , సీఎం చంద్ర‌బాబు, లేదు రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని గ‌ర్జిస్తున్న వైసీపీ, దాని అధినేత జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. మ‌రోప‌క్క‌, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ […]

ముద్ర‌గ‌డ ముద్ర చెరిగిపోతుందా?!

అవును! కాపు స‌మాజాన్ని త‌న జాతి అంటూ భుజాల మీద‌కి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపు జాతి కోసం ఆయ‌న ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని నేత‌గా ఇటీవ‌ల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్ర‌గ‌డ ఎదిగిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని ప‌దే ప‌దే డిమాండ్ […]