అక్కినేని నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. నాగార్జున సతీమణి అమల సైతం అఖిల్ తో సమానంగానే నాగచైతన్యను చూస్తుంది. అయితే ఈ అన్నదమ్ముల గురించి అమల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అమల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ గురించి చెప్పమని అడగగా.. అతనికి మనుషులంటే చాలా ఇష్టమని.. పీపుల్ లవ్వింగ్ పర్సన్ అని అమల పేర్కొంది. అలాగే నాగ చైతన్య గురించి ప్రశ్నించగా.. అఖిల్ కంటే ఎక్కువగా చెప్పి అందరికీ ఆకట్టుకుంది. చైతు చాలా తెలివైన వాడని, ఎంతో ధైర్యవంతుడని అమల చెప్పుకొచ్చింది. అలాగే చైతు తనకు ఏం కావాలో ఫుల్ క్లారిటీతో ఉంటాడని, కెరీర్ పట్ల, చేసే వర్క్ పట్ల ఫోకస్ గా ఉంటాడని ప్రశంసలు కురిపించింది.
దీంతో అమల కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి. మొత్తానికి చైతు, అఖిల్ మధ్య చాలా తేడా ఉంటుందని అమల వ్యాఖ్యలతో అర్థమైపోయింది. కాగా, ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ సరైన్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. నాగచైతన్య `కస్టడీ` మూవీతో వచ్చాడు. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో వీరిద్దరూ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై దృష్టి సారించారు.