మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.
సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, జయరాయ్, అంజలి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు స్టోరీ అందిస్తుండగా.. పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఈ చిత్రంలో చరణ్, కియారాల మధ్య ఓ ఘాటు లిప్ లాక్ సీన్ ఉంటుందట. మొదట ఈ సీన్ లేకపోయినా.. కథ డిమాండ్ చేయడం వల్ల చరణ్, కియారాల మధ్య శంకర్ లిప్ లాక్ సీన్ పెట్టాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. నిజానికి చరణ్ ఇటువంటి సీన్స్ ను ఎవైడ్ చేస్తుంటారు. కానీ, ఈసారి శంకర్ మాట కాదనలేక చరణ్ లిప్ లాక్ సీన్ కు ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కాగా, కియారా రీసెంట్ గా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. ప్రియుడు, బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా ఏడడుగులు వేసింది.