దారుణంగా మారిన ఛార్మి ప‌రిస్థితి.. తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు!?

ఛార్మి కౌర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన చార్మి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్న సమయంలో ఈ అమ్మడు `జ్యోతిలక్ష్మి` సినిమాతో నిర్మాతగా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రను పోషించింది.

టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించడం ప్రారంభించింది. అలా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక దుకాణం స‌ద్దుకోవాల్సిందే అనుకుంటున్న త‌రుణంలో `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో ఛార్మీ, పూరీ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాయి. ఈ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో ఇద్ద‌రూ క‌లిసి `లైగ‌ర్‌` మూవీని రూపొందించారు.

విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం గ‌త ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా దెబ్బ‌కు ఛార్మి, పూరీలు భారీ అప్పుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ఛార్మీ ప‌రిస్థితి దారుణంగా మారింది. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్లిపోయింద‌ట‌. లైగర్ ప్రొమోషన్స్ లో ఛార్మి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది..చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితులను ఎదురుకున్నాను అంటూ ఆమె కష్ట కాలం ని తల్చుకుంటూ ఏడ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి అదే పరిస్థితికి వెళ్ళిపోయినట్టు ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.