టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్కు జంటగా అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి భారీ నెగిటివ్ టాక్ను మూట కొట్టుకుని భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.
ఈ సినిమా తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివనిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయకు జంటగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది.ఈ సినిమాపై విజయ్- సమంత అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మరో విశేషం ఏమిటంటే, ఈటీవీల న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జెర్సీ.. ఈ సినిమాను యువ దర్శకుడుగౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు.
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ ఈ దర్శకుడు తో తాజాగా అనౌన్స్ చేశాడు.టాలీవుడ్ లో వరుస విజయాల్లో దూసుకుపోతున్న యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సితార బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించబోతున్నామని సంక్రాంతి కానుకగా ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మూవీ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.
ఆ పోస్టర్ పై.. ‘నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో నాకు తెలియదు’ అంటూ ఒక గూఢచారి చెప్పే మాటల్ని ఆ పోస్టర్లో చూపించారు. విజయ్ దేవరకొండ కెరియర్ లోనే 12వ సినిమాగా తెరకెక్కక పోతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అతి త్వరలోనే వెళ్లడంచనున్నారు.