ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ 2లో ఇటీవల ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రముఖ హీరో గోపీచంద్ సైతం బాలయ్య షోకు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసి ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. ఈ రెండు ఎపిసోడ్లు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ షూటింగ్ కి సంబంధించిన ఆన్ సీన్ వీడియోని విడుదల చేయనున్నట్లు ఆమా టీమ్ ప్రకటించింది.
`ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రభాస్ మరో కోణాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. డార్లింగ్ ఎపిసోడ్ బిటిఎస్ వీడియో రిలీజ్ చేయబోతున్నాము..గెట్ రెడీ గైస్` అంటూ ప్రకటించి ఫ్యాన్స్ ని మరింత ఖుషి చేసింది. నేడే ప్రభాస్ షూటింగ్ కి సంబంధించిన ఆన్ సీన్ వీడియో బయటకు రాబోతోంది. మరి ఈ వీడియో ఫ్యాన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.