కాలం మారుతుంది.. టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సైతం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువైపోయాయి. గతంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామరస్ పాత్రలకు మాత్రమే అనుకునేవారు. హీరో పక్కన ముద్దులు పెట్టుకోవడానికి పనికొచ్చేవాళ్ళు ..కానీ ఇప్పటి కాలం హీరోయిన్స్ ట్రెండ్ మారుస్తున్నారు.
హీరో లేకుండా హీరోయిన్గా సినిమాలు చేసి మాలోను టాలెంట్ ఉంది.. మాలోను సత్తా ఉంది అంటూ ప్రూవ్ చేస్తున్నారు . రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే . ఇక ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరుగా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార కూడా రీసెంట్ గా కనెక్ట్ మూవీ తో హీరో లేకుండానే సినిమాను రిలీజ్ చేసి పాజిటివ్ టాక్ దక్కించుకుంది . కంటెంట్ పెద్దగా లేదనే కానీ కొంచెం ట్రై చేసి ఉంటే కచ్చితంగా నయనతార ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడి ఉండేది.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో నయనతార ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా నయనతార హోర్డింగు లు చెన్నై రోడ్లు లల్లో నిండిపోయాయి . ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నయనతార కనెక్ట్ చిత్రం కోసం ఏర్పాటు చేసిన భారీ బ్యానర్స్ , హోర్డింగులను పోస్ట్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ” పదేళ్ల క్రితం ఈ పరిస్థితి హీరోయిన్లకు లేదు ..కానీ ఇప్పుడు స్టార్ హీరోలకి ధీటుగా హీరోయిన్ చిత్రాలు వస్తున్నాయి ” అంటూ నెటిజన్ ట్వీట్ చేసింది .
అదే ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ సమంత “మహిళలు ఎదుగుతున్నారు” అంటూ కామెంట్ పెట్టింది . ఈ క్రమంలోనే సమంత ఎలాగైనా సరే హీరోయిన్స్ , ఆడవాళ్లు మగవాళ్ళ తోడు లేకుండా బ్రతకగలగాలి అంటూ అలాంటి వాళ్లకి లొంగకూడదు అంటూ పరోక్షకంగా కామెంట్ చేసింది అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సరే సమంత ఏ ట్విట్ చేసిన దానికి పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అలవాటైపోయింది . ప్రస్తుతం సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి నెమ్మదిగా కోలుకుంటుంది . త్వరలోనే విజయ్ దేవరకొండ తో ఖుషి సెకండ్ షెడ్యూల్లో పాల్గొనబోతుంది.
🫶🏻🫶🏻🫶🏻🫶🏻
Women Rising!! https://t.co/qR3N3OozK8— Samantha (@Samanthaprabhu2) January 2, 2023