పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోందని సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా బరిలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా దిగబోతోందట. అక్టోబర్ 5వ తేదీని ఈ సినిమా రిలీజ్ డేట్గా కూడా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, గబ్బర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన పవన్-హరీష్ల కాంబినేషన్ ఈ సారి కూడా సక్సెస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు అభిమానులు సైతం ఈ మూవీపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను పవన్ ఏ మేరకు అందుకుంటాడో చూడాలి.