విజయ్ దేవరకొండ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మూడో చిత్రమే `పుష్పక విమానం`. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీత్ సైనీ, సాన్వి మేఘన హీరోయిన్లుగా నటించగా.. సునీల్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాలు అనే పాయింట్ మీద తెరకెక్కిన ఈ చిత్రం మొదటి సగం సరదాగా, రెండో సగం ఉత్కంఠగా, ప్రీ క్లైమాక్స్ బాధగా, క్లైమాక్స్ సందేశాత్మకంగా ఉండటంతో.. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడిందని తాజాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు.
బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని..ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తామని అనురాగ్ తెలిపారు. ఇక వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా హీందీ రీమేక్లో రాజకుమార్ రావు, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా వీరి ముగ్గురులో ఎవరో ఒకరు నటించనున్నారని తెలుస్తోంది.