టాలీవడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ సినిమాలోని ఆమె లుక్స్ను విడుదల చేశారు.
ఈ ఫొటోల్లో రకుల్ లంగాఓణీ అందాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, ఆమె ఫొటోలపై లైకులు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. దాంతో ప్రస్తుతం రకుల్ నయా లుక్స్ నెట్టింట వైరల్గా మారాయి.