బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలు ఉండటంతో బిజీబిజీగా ఉంది. ఈమె తాజాగా నటిస్తున్న సినిమా తేజస్ మెరాదాబాద్ అక్టోబరు 1న షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది.
ఆ తరువాత ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్నో లో సీఎం అధికారిక నివాసంలో గౌరవపూర్వకంగా కలిసింది.
ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆ ముఖ్యమంత్రి కి ఆమె థ్యాంక్స్ చెప్పినట్లు తెలియజేసింది.సీఎం యోగిని కలిసినప్పుడు వారిద్దరి సమావేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఈ క్రమంలో రాబోయే యూపీ ఎన్నికలలో ఆయన గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
అలాగే ఆ సమయంలో ఆయన రామమందిర పూజకు ఉపయోగించిన రామ్ దర్బార్ నాణెం బహుమతిగా ఇచ్చినందుకు అందుకు అతనికి థాంక్స్ చెప్పింది.
ఈ సందర్భంగా ఆమెకు ఓడిఓపి ప్రోడక్ట్ ని సీఎం అందజేశారు. కంగనా రనౌత్ ప్రస్తుతం తేజస్ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఢాకాడ్, మణికర్ణిక రిటర్న్స్, సీత : ది ఇన్ కార్నేషన్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.