అత‌ని వ‌ల్ల‌ దారుణంగా మోస‌పోయా.. అర్జున్ రెడ్డి బ్యూటీ షా కింగ్ కామెంట్స్‌..!

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది యంగ్‌ బ్యూటీ షాలిని పాండే. మొదటి సినిమాతోనే లిప్ కిస్లు, బోల్డ్ కంటెంట్ తో కుర్ర కారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ క‌డ‌తాయ‌ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించడం ఖాయం అంటూ అందరూ భావించారు. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడికి పలు ఆఫర్లు వచ్చిన.. ఆ సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్ లో మెల్లమెల్లగా ఆఫర్లు తగ్గాయి.

ఈ క్ర‌మంలో గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న షాలిని తాజాగా హిందీలో మహారాజు వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులతో నెటింట‌ సంచలనం సృష్టిస్తుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని మాట్లాడుతూ.. తనకు దారుణంగా మోసం జరిగిందని.. ఓ వ్యక్తి ఆమెను ఘోరంగా మోసం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత అన్ని అలాంటి పాత్రల్లోనే అవకాశాలు వచ్చాయని.. కానీ అన్ని రొటీన్ గానే ఉండడంతో వాటిని వదులుకున్న అంటూ వివరించింది.

( Photos : Instagram )

కాగా ఈ సినిమా సక్సెస్ తర్వాత నేను చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని.. దారుణంగా కించపరిచి.. నా బాడీని కూడా టార్గెట్ చేస్తూ రకరకాలుగా విమర్శించారని.. నాకు భాష రాకపోవడంతో పెద్ద సమస్యగా నేను దానిని ఫీల్ అవ్వలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇండస్ట్రీలో కొందరి బిహేవియర్ మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించిందని.. భాషరాదని నాతో చెప్పకూడని మాటలు, చేయకూడని చేతలు కూడా చేయించే వారని ఎమోషనల్ అయింది. ఇక ఇండస్ట్రీకి రావడం కొత్త కావడంతో నేను కూడా ఎదురు మాట్లాడలేకపోయా.. అర్జున్ రెడ్డి టైంలో నా మేనేజర్ కూడా నన్ను దారుణంగా మోసగించాడని వివరించింది. ప్రస్తుతం షాలిని పాండే చేసిన కామెంట్స్ నెటింట తెగ‌ వైరల్‌గా మారాయి.