సాధారణంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎవరు కనిపించిన.. వద్దు.. వద్దు.. అంటున్నా వినిపించుకోకుండా కెమెరాలను వారిపై తిప్పి మరి ఫోటోలపై ఫోటోలు తీస్తూతూ తెగ వైరల్ చేసేస్తూ ఉంటారు. వారి వెంటపడి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే అలా ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద సెలబ్రిటీల వరకు అందరిని ఫాలో అవుతూ తమ కెమెరాలు బంధిస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది మరి ఎక్కువగా జరుగుతుంటుంది.
అనన్య పాండే, జాన్వి కపూర్, అదితీ రావ్ హైధారీ ఇలా ఎంత మంది హీరోయిన్లు బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ల చేతిలో బాయ్ ఫ్రెండ్స్తో అడ్డంగా దొరికిపోయారు. అలా అప్పట్లో కత్రినా కైఫ్ – వికీ కౌశల్ కూడా కెమెరా కళ్ళకు చికారు. అయితే తమ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కెమెరా పర్సన్స్ కోరారట కత్రీనా. ఈ విషయాన్ని ఫోటోగ్రాఫర్ స్నేహ విశాల్ స్వయంగా వెల్లడించారు. ఒకసారి కత్రినా తమ ఫోటోలు తీయద్దని కోరుకున్నారని.. కావాలంటే నెక్స్ట్ టైం పిలుస్తానని తన మేనేజర్ నా ఫోన్ నెంబర్ తీసుకున్నారని వివరించారు.
తర్వాత యష్ రాజ్ స్టూడియోస్ కు రమ్మని చాలా మంచిగా నాకోసం స్టిల్స్ ఇస్తూ ఫోటోలు దిగారని.. వికీ కౌశల్ తో కలిసున్న ఫోటోలను కూడా తీశానని.. అప్పుడు కేవలం తన ఫోటోలు మాత్రమే తీయమని.. మిగతావి డిలీట్ చేయమని కోరినట్లు వివరించింది. అయితే ఇప్పుడు వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అలాగే అనన్య కూడా హర్ధిక్ రాయ్కాపూర్ తో ఉన్న ఫోటోలు మేము క్లిక్ చేసాం. కానీ అప్పట్లో వాటిని తను కూడా డిలీట్ చేసింది అంటూ చెప్పుకొచ్చారు.